Stock Market: స్టాక్ మార్కెట్లలో జీడీపీ జోరు.. ఆల్టైం గరిష్ఠాలకు సూచీలు
Stock Market: మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,021 పాయింట్లు పెరిగి 73,521 వద్ద, నిఫ్టీ 301 పాయింట్లు ఎగబాకి 22,284 దగ్గర కొనసాగుతున్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం ట్రేడింగ్లో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో రెండు ప్రధాన సూచీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పెరిగి 73,574.02 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు పుంజుకొని 22,304 దగ్గర ఆల్టైం రికార్డును నమోదు చేశాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్న సానుకూల వాతావరణంతో పాటు కీలక షేర్లు రాణించడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,021 పాయింట్లు పెరిగి 73,521 వద్ద, నిఫ్టీ 301 పాయింట్లు ఎగబాకి 22,284 దగ్గర కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్-30 సూచీలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, విప్రో షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి రాణించింది. వ్యవసాయ రంగం నెమ్మదించినా, తయారీ రంగంలో రెండంకెల వృద్ధి నమోదవ్వడం, గనుల తవ్వకం, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో మూడో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 8.4% వృద్ధి చెందింది. మరోవైపు 2023-24 మొత్తం మీద వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కావొచ్చని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. ఈ గణాంకాలు సూచీల్లో ఉత్సాహం నింపాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలూ దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. త్వరలో అమెరికాలో వడ్డీరేట్ల కోతపై ఫెడరల్ రిజర్వ్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం సైతం దిగొచ్చే సూచనలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అక్కడి మార్కెట్లు రాణించాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు పాజిటివ్గా ట్రేడవుతున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు రికార్డు గరిష్ఠాలకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.