Stock Maket today: సెన్సెక్స్ 77,000 తాకి, వెనక్కి
చరిత్రలోనే తొలిసారి 77,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన సెన్సెక్స్, ఆ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఐటీ కంపెనీలతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి.
గరిష్ఠాల్లో మదుపర్ల లాభాల స్వీకరణ
చరిత్రలోనే తొలిసారి 77,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించిన సెన్సెక్స్, ఆ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఐటీ కంపెనీలతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 79.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో లాభపడగా, సియోల్ నష్టపోయింది. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 76,935.41 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. అదే జోరులో 77,079.04 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. గరిష్ఠాల్లో లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఒకదశలో 76,379.73 పాయింట్లకు పడిపోయింది. చివరకు 203.28 పాయింట్ల నష్టంతో 76,490.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 30.95 పాయింట్లు తగ్గి 23,259.20 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 23,227.15- 23,411.90 పాయింట్ల మధ్య కదలాడింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 15 నష్టపోయాయి. టెక్ మహీంద్రా 2.72%, ఇన్ఫోసిస్ 2.20%, విప్రో 1.95%, ఎం అండ్ ఎం 1.73%, బజాజ్ ఫైనాన్స్ 1.42%, టీసీఎస్ 0.94%, హెచ్సీఎల్ టెక్ 0.88% డీలాపడ్డాయి. అల్ట్రాటెక్ 3.52%, పవర్గ్రిడ్ 2.07%, నెస్లే 1.74%, యాక్సిస్ బ్యాంక్ 1.16%, ఎన్టీపీసీ 1.07%, టాటా స్టీల్ 0.70% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో సేవలు 1.61%, స్థిరాస్తి 1.34%, కమొడిటీస్ 1.28%, యుటిలిటీస్ 1.11%, ఆరోగ్య సంరక్షణ 0.77%, పరిశ్రమలు 0.49% నీరసపడ్డాయి. ఐటీ, వాహన, లోహ, టెక్ మెప్పించాయి. బీఎస్ఈలో 1416 షేర్లు నష్టాల్లో ముగియగా, 2590 స్క్రిప్లు లాభపడ్డాయి. 123 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేరు అరంగేట్రంలో రాణించింది. ఇష్యూ ధర రూ.136తో పోలిస్తే బీఎస్ఈలో షేరు ట్రేడింగ్ 21.32% లాభంతో రూ.165 వద్ద ప్రారంభమైంది. అదే గరిష్ఠస్థాయి కూడా. చివరకు 17.17% లాభంతో రూ.159.35 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.591.25 కోట్లుగా నమోదైంది.
- సంస్థలకు కృత్రిమే మేధ (ఏఐ) సేవలను సులభతరం చేసేందుకు ‘ఎంటర్ప్రైజ్ ఏఐ ఫౌండ్రీ’ని తీసుకొచ్చినట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది.
- బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎంఫసిస్లో 15.08% వాటాను రూ.6,735 కోట్లకు ప్రమోటర్ సంస్థ బ్లాక్స్టోన్ విక్రయించింది. బ్లాక్స్టోన్కు చెందిన బీసీపీ టాప్కో ఈ షేర్లను ఎన్ఎస్ఈలో విక్రయించింది. ఈ లావాదేవీ తర్వాత కంపెనీలో బీసీపీ టాప్కో వాటా 55.45% నుంచి 40.37 శాతానికి పరిమితమైంది. ఈ వార్తలతో షేరు 3% నష్టపోయి రూ.2,398 వద్ద ముగిసింది.
- రుణదాతలకు బకాయిలు పూర్తిగా చెల్లించడంతో, స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా రిలయన్స్ పవర్ మారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీకి దాదాపు రూ.800 కోట్ల అప్పులు ఉండగా, బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లు సమాచారం.
- ఇక్సిగో ఐపీఓ మొదటి రోజు 1.95 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 4,37,69,494 షేర్లను ఆఫర్ చేయగా, 8,51,54,349 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో 6.17 రెట్ల స్పందన కనిపించింది.
రూ.425.22 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
మార్కెట్లు నష్టపోయినప్పటికీ.. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ సోమవారం రూ.1.73 లక్షల కోట్లు పెరిగి, జీవనకాల గరిష్ఠమైన రూ.425.22 లక్షల కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్