stock market: హమ్మయ్యా.. మార్కెట్ కోలుకుంది..!
వరుస నష్టాల నుంచి మార్కెట్ సూచీలు కోలుకొన్నాయి. నేడు సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ను ముగించింది.
ఇంటర్నెట్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) కోలుకొని మెల్లగా లాభాల బాటపట్టాయి. గత వారం రెండు సెషన్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన మదుపర్లకు నేటి ట్రేడింగ్ కొంత ఊరటనిచ్చింది. సోమవారం ట్రేడింగ్లో మధ్యాహ్నం వరకు కొంత నష్టాల్లో ఉన్నా.. ఆ తర్వాత మెల్లగా లాభాల బాటపట్టాయి. అదానీ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు నేడు కూడా భారీగా విలువ కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,648 వద్ద స్థిరపడ్డాయి. నేడు సెన్సెక్స్ ఒక దశలో అత్యధికంగా 550 పాయింట్లు కోల్పోగా.. చివరికి 169 పాయింట్ల లాభంతో స్థిరపడింది. అంటే మొత్తం 801 పాయింట్ల మేరకు ఊగిసలాట ధోరణి కనిపించింది. మధ్యాహ్నం 2.02 సమయంలో నిఫ్టీ 17,450 వద్దకు చేరింది. ఆ సమయంలో మదుపర్ల సంపద దాదాపు రూ.3.83 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. కానీ, ఆ తర్వాత సూచీలు లాభాలబాట పట్టాయి.
నేటి ఇంట్రాడే ట్రేడింగ్లో రిలయన్స్ షేరు ఏకంగా 1.2శాతం పుంజుకొంది. ఇది మార్కెట్ కోలుకోవడానికి సాయపడింది. ఐటీ కంపెనీల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. టెక్ మహీంద్రా 0.8శాతం, హెచ్సీఎల్ టెక్ 2శాతం లాభపడ్డాయి. వొడాఫోన్ షేరు 6శాతం పెరిగింది. బీఎస్ఈలో డేటా పాట్రన్స్, ఏజీఐ గ్రీన్పాక్, ఇండస్ టవర్స్, ఇంటెలెక్ట్ డిజైన్ షేర్ల విలువ అత్యధికంగా పెరగ్గా.. అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ ట్రాన్స్మిషన్, సియారామ్ సిల్క్స్, ఈఐడీ పార్రీ సంస్థలు భారీగా నష్టపోయాయి.
అదానీ గ్రూప్ విలువ రూ.6 లక్షల కోట్లు ఆవిరి..
అదానీ ఎనర్జీ, అదానీ టోల్ గ్యాస్ 20శాతం విలువ కోల్పోయాయి. ఇక అదానీ ట్రాన్స్మెషీన్స్ 15శాతం నష్టపోయింది. అదానీ విల్మర్, అదానీ పవర్ షేర్ల విలువ ఐదు శాతం మేర కుంగింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్ల మేరకు నష్టపోయింది.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. భారత్ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దీనికి హిండెన్బర్గ్ కూడా ఘాటుగానే స్పందించింది. ‘‘కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూప్.. జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోంది. భారత్పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్లు ప్రచారం చేస్తోంది. సంపన్నులైనా.. అనామకులైనా మోసం ఎప్పటికీ మోసమే. జాతీయవాదం పేరు చెప్పి లేదా అస్పష్టమైన స్పందనలతోనో మోసాన్ని దాచి ఉంచలేరు’’ అంటూ ఎదురు దాడి చేసింది. ఈ పరిణామ క్రమాలు అదానీ మదపరుల్లో ఆందోళనలు నింపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం