stock market: హమ్మయ్యా.. మార్కెట్ కోలుకుంది..!
వరుస నష్టాల నుంచి మార్కెట్ సూచీలు కోలుకొన్నాయి. నేడు సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ను ముగించింది.
ఇంటర్నెట్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) కోలుకొని మెల్లగా లాభాల బాటపట్టాయి. గత వారం రెండు సెషన్లలో ఏకంగా రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన మదుపర్లకు నేటి ట్రేడింగ్ కొంత ఊరటనిచ్చింది. సోమవారం ట్రేడింగ్లో మధ్యాహ్నం వరకు కొంత నష్టాల్లో ఉన్నా.. ఆ తర్వాత మెల్లగా లాభాల బాటపట్టాయి. అదానీ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు నేడు కూడా భారీగా విలువ కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,648 వద్ద స్థిరపడ్డాయి. నేడు సెన్సెక్స్ ఒక దశలో అత్యధికంగా 550 పాయింట్లు కోల్పోగా.. చివరికి 169 పాయింట్ల లాభంతో స్థిరపడింది. అంటే మొత్తం 801 పాయింట్ల మేరకు ఊగిసలాట ధోరణి కనిపించింది. మధ్యాహ్నం 2.02 సమయంలో నిఫ్టీ 17,450 వద్దకు చేరింది. ఆ సమయంలో మదుపర్ల సంపద దాదాపు రూ.3.83 లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది. కానీ, ఆ తర్వాత సూచీలు లాభాలబాట పట్టాయి.
నేటి ఇంట్రాడే ట్రేడింగ్లో రిలయన్స్ షేరు ఏకంగా 1.2శాతం పుంజుకొంది. ఇది మార్కెట్ కోలుకోవడానికి సాయపడింది. ఐటీ కంపెనీల షేర్లు కూడా లాభాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. టెక్ మహీంద్రా 0.8శాతం, హెచ్సీఎల్ టెక్ 2శాతం లాభపడ్డాయి. వొడాఫోన్ షేరు 6శాతం పెరిగింది. బీఎస్ఈలో డేటా పాట్రన్స్, ఏజీఐ గ్రీన్పాక్, ఇండస్ టవర్స్, ఇంటెలెక్ట్ డిజైన్ షేర్ల విలువ అత్యధికంగా పెరగ్గా.. అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ ట్రాన్స్మిషన్, సియారామ్ సిల్క్స్, ఈఐడీ పార్రీ సంస్థలు భారీగా నష్టపోయాయి.
అదానీ గ్రూప్ విలువ రూ.6 లక్షల కోట్లు ఆవిరి..
అదానీ ఎనర్జీ, అదానీ టోల్ గ్యాస్ 20శాతం విలువ కోల్పోయాయి. ఇక అదానీ ట్రాన్స్మెషీన్స్ 15శాతం నష్టపోయింది. అదానీ విల్మర్, అదానీ పవర్ షేర్ల విలువ ఐదు శాతం మేర కుంగింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ గ్రూప్ మార్కెట్ విలువ రూ.6 లక్షల కోట్ల మేరకు నష్టపోయింది.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. భారత్ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది. దీనికి హిండెన్బర్గ్ కూడా ఘాటుగానే స్పందించింది. ‘‘కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోన్న అదానీ గ్రూప్.. జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోంది. భారత్పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్లు ప్రచారం చేస్తోంది. సంపన్నులైనా.. అనామకులైనా మోసం ఎప్పటికీ మోసమే. జాతీయవాదం పేరు చెప్పి లేదా అస్పష్టమైన స్పందనలతోనో మోసాన్ని దాచి ఉంచలేరు’’ అంటూ ఎదురు దాడి చేసింది. ఈ పరిణామ క్రమాలు అదానీ మదపరుల్లో ఆందోళనలు నింపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?