Stock market: గట్టి షాక్ నుంచి మదుపరికి ఊపిరి.. మళ్లీ 74వేల ఎగువకు సెన్సెక్స్
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లు, నిఫ్టీ 778 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock market | ముంబయి: సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడడంతో భారీ నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market). . ఇవాళ కోలుకోవడమే కాకుండా భారీ లాభాలను నమోదు చేశాయి. చరిత్రలోనే అతిపెద్ద నష్టంతో షాక్లోకి జారుకున్న మదుపరికి.. ఓ విధంగా కోలుకునే అవకాశం లభించింది. భాజపాకు సొంతంగా మెజారిటీ రాకపోయినా.. మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవడంతో సూచీలు రాణించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2,500 పాయింట్ల మేర లాభపడి.. తిరిగి తన 74వేల మార్కును నిలబెట్టుకుంది. నిఫ్టీ 22,600 పాయింట్ల ఎగువన ముగిసింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.
సెన్సెక్స్ ఉదయం 73,027.88 (క్రితం ముగింపు 72,079.05) దాదాపు వెయ్యి పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత లాభాల్లోనే కొనసాగింది. కేంద్రంలో మరోసారి అధికారం ఏర్పాటు దిశగా ఎన్డీయే అడుగులు వేస్తుండడంతో సూచీలు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇంట్రాడేలో 74,534.82 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2,303.19 పాయింట్ల లాభంతో 74,382.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 778.50 పాయింట్ల లాభంతో 22,663 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.37గా ఉంది. సెన్సెక్స్లో అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.39 డాలర్లకు చేరగా.. బంగారం 2350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
NSE ప్రపంచ రికార్డు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అరుదైన ఘనత నమోదు చేసింది. కేవలం ఒక్క ట్రేడింగ్ రోజులోనే అత్యధిక లావాదేవీలు జరిపి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్కుమార్ చౌహాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘బుధవారం (జూన్ 5) ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు 6 గంటల 15 నిమిషాల పాటు సాగిన ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈ 1971 కోట్ల (19.71 బిలియన్) ఆర్డర్లను ప్రాసెస్ చేసింది. 28.05 కోట్ల (280.55 మిలియన్లు) ట్రేడ్లను నిర్వహించింది. ఒక్క రోజులోనే అత్యధిక లావాదేవీలు నిర్వహించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?