Stock market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,600 ఎగువకు నిఫ్టీ

Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 267 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

Published : 22 May 2024 16:04 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్‌ 250 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ 22,600 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,165 పాయిట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 73,860.33- 74,307.79 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 68.75 పాయింట్ల లాభంతో 22,597.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.28గా ఉంది.

సెన్సెక్స్‌- 30 సూచీలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 82.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని