Afcons Infra IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది.
Afcons Infra IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ (Shapoorji Pallonji) గ్రూప్నకు చెందిన నిర్మాణ, ఇంజినీరింగ్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపీఓకి (Afcons Infra IPO) రానుంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. రూ.7,000 కోట్ల సమీకరణకు దరఖాస్తు చేసుకుంది. దీంట్లో రూ.1,250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.5,750 కోట్లు ‘ఆఫర్ ఫర్ సేల్ (OFS)’ కింద సమీకరించనున్నట్లు వెల్లడించింది.
ఓఎఫ్ఎస్లో భాగంగా గోస్వామి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తమ వాటాలను విక్రయించనున్నట్లు ప్రాథమిక పత్రాల ద్వారా తెలుస్తోంది. 2023 డిసెంబర్ నాటికి ఆఫ్కాన్స్లో గోస్వామి ఇన్ఫ్రాకు 72.35 శాతం వాటాలున్నాయి. మిగిలిన 16.64 శాతం వాటా షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ చేతిలో ఉన్నాయి. ఐపీఓలో (IPO) సమీకరించిన నిధుల్లో రూ.150 కోట్లు మూలధన వ్యయానికి, రూ.350 కోట్లు నిర్వహణ మూలధన వ్యయం, రూ.500 కోట్లు రుణ చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డీఏఎం క్యాపిటల్, నొమురా, జెఫరీస్, ఎస్బీఐ క్యాపిటల్ ఈ పబ్లిక్ ఇష్యూకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
భారత్తో పాటు అంతర్జాతీయంగా ఆఫ్కాన్స్ పలు ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతోంది. పది ఆర్థిక సంవత్సరాల్లో 15 దేశాల్లో 76 ప్రాజెక్టులు పూర్తి చేసింది. వీటి కాంట్రాక్టు విలువ దాదాపు రూ.52,200 కోట్లు. ప్రస్తుతం 13 దేశాల్లో 67 ప్రాజెక్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటి ఆర్డర్ బుక్ విలువ రూ.34,888 కోట్లు. దీంట్లో రూ.26,093 కోట్లు దేశీయ, రూ.8,795 కోట్లు అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించినవి. మరోవైపు ఈ కంపెనీ వద్ద పలు ప్రత్యేకమైన యంత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటల్ టన్నెల్, హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్, దిల్లీ- మేరఠ్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, దిల్లీ మెట్రో ఫేజ్-IV వంటి కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది.
2023 సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయం రూ.6,655 కోట్లు, నికర లాభం రూ.195 కోట్లుగా నమోదైంది. చివరిసారి ఎస్పీ గ్రూప్ నుంచి 2019 ఆగస్టులో స్టెర్లింగ్ అండ్ విల్సర్ సోలార్ ఐపీఓకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు