Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
Stock Market Closing bell: సెన్సెక్స్ (Sensex) 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది.
Stock Market Closing bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం దూసుకెళ్లాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ మదుపర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. తాజా ఎన్నికల్లో భాజపా విజయం నేటి బుల్ పరుగుకు ప్రధాన కారణంగా నిలిచింది.
ఉదయం సెన్సెక్స్ (Sensex) 68,435.34 దగ్గర భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 68,918.22 వద్ద ఆల్టైం రికార్డును నమోదు చేసింది. చివరకు 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 20,601.95 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 20,702.65 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.36 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్, విప్రో మాత్రమే నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. ఎల్అండ్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ మూడు శాతం మేర పెరిగాయి. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రెండు శాతానికి పైగా పుంజుకున్నాయి. ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, పవర్గ్రిడ్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు ఒకశాతం మేర రాణించాయి.
ర్యాలీకి కారణాలివే..
- ఎన్నికల ఫలితాలు: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే నేటి మార్కెట్ల పరుగుకు ప్రధాన కారణం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయనే అంచనాలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి.
- వడ్డీరేట్ల కోత: ద్రవ్యోల్బణ కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి వరకు కీలక రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లు గరిష్ఠాలకు చేరాయి. తాజాగా ద్రవ్యోల్బణం చల్లబడుతున్నట్లు గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై రేట్ల పెంపును నిలిపివేసి.. వచ్చే ఏడాది నుంచి కోతలు అమలు చేసే అవకాశం ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
- ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలు: వడ్డీరేట్ల కోత వార్తలు ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నింపింది. దీంతో అమెరికా, ఐరోపా సహా ఆసియా- పసిఫిక్ సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
- ఎఫ్ఐఐల కొనుగోళ్లు: విదేశీ సంస్థాగత మదుపర్లు గతకొన్ని నెలలుగా దేశీయ ఈక్విటీ షేర్లను వరుసగా విక్రయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ చివర్లో మాత్రం పరిస్థితులు మారాయి. గత కొన్ని రోజులుగా వీరు నికర కొనుగోలుదారులుగా నిలుస్తుండడం సూచీలకు కలిసొస్తోంది.
రూ.5 లక్షల కోట్లకు పైగా లాభం..
మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.343 లక్షల కోట్లకు చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ విలువ రూ.14 లక్షల కోట్లకు పైగా ఎగబాకడం విశేషం. బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఇటీవలే నాలుగు లక్షల కోట్ల డాలర్ల కీలక మైలురాయిని అధిగమించిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ సైతం శుక్రవారం ఈ కీలక మైలురాయి దాటింది.
‘అదానీ’ షేర్ల ర్యాలీ..
అదానీ గ్రూప్ షేర్లలో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా అదానీ గ్రీన్ ఎనర్జీ.. బీఎస్ఈలో 9.47 శాతం పెరిగి రూ.1,123 దగ్గర స్థిరపడింది. తర్వాత అంబుజా సిమెంట్స్ 7.36 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 7.13 శాతం పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి