Stock market: ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో మార్కెట్‌ సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 535.15 పాయింట్లు, నిఫ్టీ 162.40 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Updated : 22 Feb 2024 15:59 IST

Stock market closing bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. టీసీఎస్‌, ఐటీసీ, రిలయన్స్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 1100 పాయింట్లు పైకెగిసింది.  

సెన్సెక్స్‌ ఈ ఉదయం 72,677.51 వద్ద (క్రితం ముగింపు 72,623.09) ప్రారంభమై మెల్లగా నష్టాల్లోకి జారుకొంది. మధ్యాహ్నం 1 గంట వరకు నష్టాల్లో కొనసాగిన సూచీ.. కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్‌ ముగిసే సమయానికి భారీగా పుంజుకుంది. ఇంట్రాడేలో 73,256.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 535.15 పాయింట్ల లాభంతో 73,158.24 వద్ద ముగిసింది.  నిఫ్టీ సైతం 162.40 పాయింట్ల లాభంతో 22,217.45 వద్ద స్థిర పడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.84గా ముగిసింది.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్ టీ, మారుతీ సుజుకీ, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇన్ఫీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహేంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని