Stock market: ఒడిదొడుకులు ఎదుర్కొన్నా లాభాల్లోనే సూచీలు
Stock market: మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 305.09 పాయింట్లు, నిఫ్టీ 76.30 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock market closing bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం సెషనల్లో స్వల్ప లాభాలతో చలించిన సూచీలు మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే కొనసాగాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
సెన్సెక్స్ ఉదయం 72,723.53 పాయింట్ల (క్రితం ముగింపు 72,790.13) వద్ద ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో 73,161.30 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 305.09 పాయింట్లు పెరిగి 73,095 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 76.30 పాయింట్లు పెరిగి 22,198.35 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.
సెన్సెక్స్లో టాటా మోటార్స్, టీసీఎస్, పవర్గ్రిడ్, ఇండస్ ఇండ్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ చమురు ధర 82.69 డాలర్లు వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2045.10 వద్ద ట్రేడవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?