Stock Market Crash: ‘షాక్’ మార్కెట్.. రూ.30 లక్షల కోట్ల సంపద ఉఫ్!
Stock Market Crash: సెన్సెక్స్ 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1,379 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద నిలిచింది.
Stock Market Crash | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం అల్లకల్లోలమయ్యాయి. బేర్ పంజాకు మదుపర్లు విలవిల్లాడారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఒకరోజు అతిపెద్ద నష్టాలు నమోదయ్యాయి. ఫలితం చూస్తుండగానే మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.
ఆరంభంలోనే బేర్ గుప్పిట్లో చిక్కిన స్టాక్ సూచీలు (Stock Market) ఏ దశలోనూ బయటకు రాలేకపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ మరింత దిగజారుతూ మదుపర్లను వణికించాయి. సెన్సెక్స్ ఉదయం 2,000 పాయింట్లకు పైగా నష్టంతో 76,285.78 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6,000 పాయింట్లకు పైగా కుంగి 70,234 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 1,900 పాయింట్ల వరకు కుంగి 21,281 దగ్గర దిగువ స్థాయికి చేరింది. చివరకు 1,379 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద నిలిచింది.
సెన్సెక్స్-30 సూచీలో హెచ్యూఎల్, నెస్లే ఇండియా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో స్థిరపడ్డాయి. ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
దెబ్బకొట్టిన అంచనాలు..
ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కాస్త భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అధికారం విషయంలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ దాటినప్పటికీ.. సీట్ల విషయంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే దాదాపు 350 స్థానాల వరకు గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, వాస్తవంలో ఆ సంఖ్య ఇప్పటివరకు 300కు దిగువనే ఉండడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. గత ఎన్నికల్లో ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన మెజారిటీ సాధించిన భాజపాకు ఈసారి కూటమి అవసరం అనివార్యమైంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. మరోవైపు 150 సీట్లకే పరిమితమవుతుందనుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకొని 220 మార్క్ దాటడం గమనార్హం. నేటి నష్టాలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల జోరులో బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం భారీగా పుంజుకున్నాయి. నేడు అవన్నీ పెద్దఎత్తున కుంగి సూచీలను బేర్ గుప్పిట్లోకి నెట్టాయి. ఎస్బీఐ, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టాటా స్టీల్, రిలయన్స్ వంటి బడా సంస్థలు భారీగా నష్టపోవడం మార్కెట్లను ఎరుపెక్కించాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ భారీ నష్టాల్లో ముగియడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?