Share Market: మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి.
సమీక్ష
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 4 పైసలు తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 0.33% తగ్గి 82.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ ఉదయం 73,338.24 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. మదుపర్ల లాభాల స్వీకరణతో ఇంట్రాడేలో 72,529.97 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్, 676.69 పాయింట్ల లాభంతో 73,663.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 203.30 పాయింట్లు పెరిగి 22,403.85 దగ్గర స్థిరపడింది.
- మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఒబెరాయ్ రియాల్టీ షేరు ఇంట్రాడేలో 9.83% పెరిగి రూ.1,730 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 8.77% లాభంతో రూ.1,713.30 వద్ద ముగిసింది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 25 పరుగులు తీశాయి. ఎం అండ్ ఎం 3.05%, టెక్ మహీంద్రా 2.66%, భారతీ ఎయిర్టెల్ 2.53%, ఇన్ఫోసిస్ 2.26%, టైటన్ 2.17%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.79%, బజాజ్ ఫిన్సర్వ్ 1.72%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.48%, ఎల్ అండ్ టీ 1.45%, విప్రో 1.36% లాభపడ్డాయి. మారుతీ, టాటా మోటార్స్, ఎస్బీఐ, పవర్గ్రిడ్ 2% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. యంత్ర పరికరాలు 2.05%, పరిశ్రమలు 1.99%, టెక్ 1.66%, స్థిరాస్తి 1.59%, ఐటీ 1.55%, టెలికాం 0.99%, ఆరోగ్య సంరక్షణ 0.70% మెరిశాయి. బీఎస్ఈలో 2040 షేర్లు లాభాల్లో ముగియగా, 1798 స్క్రిప్లు నష్టపోయాయి. 114 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
- ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్ సొల్యూషన్స్ అందించే ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ ఈనెల 22న ప్రారంభమై 27న ముగియనుంది. ధరల శ్రేణిగా రూ.364-383 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.599 కోట్లు సమీకరించనుంది. యాంకర్ మదుపర్లు 21న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు. రిటైల్ మదుపర్లు కనీసం 39 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
- గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ రెండో రోజుకు 79% స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 5,28,69,677 షేర్లను ఆఫర్ చేయగా, 4,17,43,735 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
- ఎస్సార్ గ్రూపునకు చెందిన మహాన్ సిపాత్ ట్రాన్స్మిషన్ ఆస్తులను రూ.1,900 కోట్లకు కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వెల్లడించింది.
- నార్వే సంస్థ ఎల్కెమ్ ఏఎస్ఏకు ఆర్ఈసీ సోలార్ నార్వే ఏఎస్ను 22 మిలియన్ డాలర్లకు విక్రయించడాన్ని పూర్తి చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
- భారతీ గ్రూప్నకు చెందిన 4 వాణిజ్య ఆస్తుల్లో 50% వాటాను బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ కొనుగోలు చేయనుంది. దిల్లీ, గురుగ్రామ్లలో ఉన్న ఈ వాణిజ్య సముదాయాల విస్తీర్ణం 33 లక్షల చదరపు అడుగులు. ఇందుకు ఎంటర్ప్రైజ్ విలువగా రూ.6,000 కోట్లు నిర్ణయించారు.
- సెక్యూరిటీల జారీ ద్వారా రూ.8,500 కోట్ల వరకు సమీకరించేందుకు వేదాంతా బోర్డు ఆమోదం తెలిపింది. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, విదేశీ కరెన్సీ కన్వెర్టబుల్ బాండ్ల ద్వారా కంపెనీ నిధులు సమీకరించనుంది. ఇందుకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంటుంది.
- దశలవారీగా 1000 ఇ-సీ3 విద్యుత్ కార్లను సరఫరా చేసేందుకు ఓహెచ్ఎం ఇ లాజిస్టిక్స్తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ఫ్రాన్స్ వాహన సంస్థ సిట్రోయెన్ వెల్లడించింది.
- తమ ప్రభుత్వ పెన్షన్ ఫండ్ నుంచి అదానీ పోర్ట్స్ సహా మూడు కంపెనీలను తొలగించాలని ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని నార్వే కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. అదానీ పోర్ట్స్తో పాటు ఎల్3 హ్యారిస్ టెక్నాలజీస్, చైనా సంస్థ వీచాయ్ పవర్ ఇందులో ఉన్నాయి. నైతిక పరమైన అంశాలే ఇందుకు కారణమని పేర్కొంది.
- రాబోయే స్పెక్ట్రమ్ వేలం కోసం రిలయన్స్ జియో అత్యధికంగా రూ.3000 కోట్లు డిపాజిట్ చేసింది. ఎయిర్టెల్ రూ.1050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్లు చొప్పున డిపాజిట్ చేసినట్లు టెలికాం విభాగం (డాట్) వెల్లడించింది.
నేటి బోర్డు సమావేశాలు: ఎన్హెచ్పీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, రైల్ వికాస్ నిగమ్, బంధన్ బ్యాంక్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఫైజర్, జీ ఎంటర్టైన్మెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు