Stock Market: మందకొడిగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్ల లాభంతో 72,818 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 22,131 దగ్గర కొనసాగుతోంది.

Published : 27 Feb 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు వీటిపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్ల లాభంతో 72,818 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 22,131 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.89 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం నష్టాల్లో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.285.15 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.5.33 కోట్ల వాటాలను అమ్మారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు