Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 44 పాయింట్ల లాభంతో 73,140 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 22,208 దగ్గర కొనసాగుతోంది.

Published : 28 Feb 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 44 పాయింట్ల లాభంతో 73,140 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 22,208 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, ఎం అండ్‌ ఎం నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.1,509.16 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,861.56 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని