Stock Market: 74,000 ఎగువకు సెన్సెక్స్‌.. 22,550 దాటిన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 177 పాయింట్లు పుంజుకొని 74,130 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,556 దగ్గర కొనసాగుతోంది.

Published : 22 May 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు (Stock Market) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 177 పాయింట్లు పుంజుకొని 74,130 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,556 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.29 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, విప్రో, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్‌ఫార్మా, మారుతీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.1,875 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,549 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు