Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,000 ఎగువన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 23,003 దగ్గర కొనసాగుతోంది.

Published : 27 May 2024 09:34 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు (Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 23,003 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, ఎం అండ్‌ ఎం, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, రిలయన్స్, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారాన్ని లాభాలతో ముగించాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.944 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.2,320 కోట్ల వాటాలను కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని