Stock Market: ఆల్‌టైం గరిష్ఠానికి నిఫ్టీ.. 73,200 పైకి సెన్సెక్స్‌

Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 73,212 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 22,235 దగ్గర కొనసాగుతోంది.

Published : 23 Feb 2024 09:41 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ ఆరంభంలోనే జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 73,212 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 22,235 దగ్గర కొనసాగుతోంది. ఆరంభంలో ఈ సూచీ 22,297.50 దగ్గర ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.86 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టైటన్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, ఎన్‌టీపీసీ, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ మార్కెట్లు ఈరోజు పనిచేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.1,410.1 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,823.7 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని