Stock Market: భారీ లాభాల్లో మార్కెట్లు.. 22,600 పైన నిఫ్టీ.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్‌

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది.

Published : 31 May 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం ఆరంభంలోనే భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూలతలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. గతకొన్ని రోజుల వరుస నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 525 పాయింట్ల లాభంతో 74,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 22,619 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.23 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఇన్ఫోసిస్‌, మారుతీ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాలతో ముగిశాయి. టెక్‌ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాలు అక్కడి సూచీలను ఒత్తిడికి గురిచేశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.3,050 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,433 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు