Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,980

Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్ల లాభంతో 75,546 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 22,982 దగ్గర కొనసాగుతోంది.

Published : 28 May 2024 09:36 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock Market ) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్ల లాభంతో 75,546 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 22,982 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.13 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టైటన్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, మారుతీ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు (Stock Market) ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.541 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.922 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.29 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని