Stock Market: 22,700 ఎగువన నిఫ్టీ.. 390 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్ల లాభంతో 74,773 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకొని 22,717 దగ్గర కొనసాగుతోంది.

Published : 06 Jun 2024 09:36 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 391 పాయింట్ల లాభంతో 74,773 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకొని 22,717 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.42  వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎం అండ్‌ ఎం, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 78.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.5,657 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.4,555 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని