Stock Market: 22,800కు దిగొచ్చిన నిఫ్టీ.. 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 223 పాయింట్ల నష్టంతో 74,947 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 22,803 దగ్గర కొనసాగుతోంది.

Published : 29 May 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 223 పాయింట్ల నష్టంతో 74,947 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 22,803 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.25 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లు (Stock Market) మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా సూచీలు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.66 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.3,231 కోట్ల వాటాలను కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 84.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని