Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,920

Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు పెరిగి 75,375 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 102 పాయింట్లు పుంజుకొని 22,923 దగ్గర కొనసాగుతోంది.

Published : 07 Jun 2024 09:44 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో వేగంగా పుంజుకున్నాయి. మరికాసేపట్లో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న విషయం తెలిసిందే. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు పెరిగి 75,375 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 102 పాయింట్లు పుంజుకొని 22,923 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.46 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్, టైటన్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం మిశ్రమంగా ముగిశాయి. యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు 25 పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 79.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.6,868 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,566 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని