Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,365

Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది.

Published : 17 May 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.50 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం రికార్డు గరిష్ఠాలను తాకాయి. లాభాల స్వీకరణతో చివరకు నష్టాల్లో ముగిశాయి. చైనా సహా ఇతర దేశాల్లో కీలక స్థూల ఆర్థిక గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అప్రమత్తంగా ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.776 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.2,128 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు