Stock Market: లాభాల్లో దేశీయ సూచీలు.. 18,350 పైకి నిఫ్టీ
Stock Market: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 131 పాయింట్ల లాభంతో 62,004 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్లు లాభపడి 18,354 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 131 పాయింట్ల లాభంతో 62,004 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్లు లాభపడి 18,354 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్గ్రిడ్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నాస్డాక్, ఎస్అండ్పీ 500 లాభాలు నమోదు చేయగా.. డోజోన్స్ సూచీ నష్టపోయింది. ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం క్షీణించింది. 2022 చివరి త్రైమాసికంలోనూ జర్మనీ వృద్ధి 0.5 శాతం క్షీణించింది. ఫలితంగా ఐరోపాలోని ఈ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 75.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ.589 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు రూ.338 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
గమనించాల్సిన స్టాక్స్..
నవ లిమిటెడ్: విద్యుత్తు, ఫెర్రో అల్లాయ్స్ ఉత్పత్తితో పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థ నవ లిమిటెడ్, ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,222 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో టర్నోవర్ రూ.3,928 కోట్లుగా నమోదైంది. 2021-22తో పోల్చితే ఆదాయం 7.8%, నికరలాభం 113% పెరిగాయి. ఆకర్షణీయ ఫలితాల నేపథ్యంలో వాటాదార్లకు 300% డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.
మాస్చిప్ టెక్నాలజీస్: ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.54 కోట్ల ఆదాయాన్ని, రూ.1.52 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.38 కోట్లు, నికరలాభం రూ.1.01 కోట్లు ఉన్నాయి.
మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్: ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.1,266.67 కోట్ల ఆదాయాన్ని, రూ.26.52 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.978.95 కోట్లు, నికరలాభం రూ.11.61 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం, నికరలాభం ఆకర్షణీయంగా పెరిగాయి.
సువెన్ ఫార్మా: మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.380.75 కోట్ల ఆదాయాన్ని, రూ.123.97 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.4.87గా నమోదైంది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.380.71 కోట్లు, నికరలాభం రూ.91.66 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం స్థిరంగా ఉన్నా లాభం పెరిగింది.
పోకర్ణ లిమిటెడ్: మార్చి త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.165.29 కోట్ల ఆదాయాన్ని, రూ.10.68 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.209.05 కోట్లు, నికరలాభం రూ. 20.10 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే నికరలాభం సగానికి తగ్గింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: లోటస్ చాకొలెట్లో నియంత్రిత 51% వాటా కొనుగోలు చేయడాన్ని పూర్తి చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వెల్లడించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ మే 24 నుంచి లోటస్ చాకొలెట్పై నియంత్రణ చేపట్టినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
IndiGo: విమాన ప్రయాణంలో వినోదాన్ని అందించే సేవల్ని మే1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్