Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 117 పాయింట్ల లాభంతో 73,923 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకొని 22,414 దగ్గర కొనసాగుతోంది.

Updated : 04 Mar 2024 09:40 IST

 

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 117 పాయింట్ల లాభంతో 73,923 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకొని 22,414 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.86 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టైటన్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) శుక్రవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ నిక్కీ సూచీ తొలిసారి 40,000 మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శనివారం నికరంగా రూ.82 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.45 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని