Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 343 పాయింట్ల లాభంతో 66,517 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు పెరిగి 19,993 దగ్గర కొనసాగుతోంది.
Stock Market Opening bell | అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 343 పాయింట్ల లాభంతో 66,517 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు పెరిగి 19,993 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.32 దగ్గర ప్రారంభమైంది.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్గ్రిడ్, సన్ఫార్మా, మారుతీ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టైటన్, ఎల్అండ్టీ, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
వడ్డీరేట్లను ఇప్పట్లో మరింత పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్కు చెందిన ఓ ఉన్నతాధికారి మంగళవారం వ్యాఖ్యానించారు. దీంతో అక్కడి సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం నష్టాల్లో స్థిరపడ్డాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. నవంబర్లో ఇప్పటి వరకు డెట్ మార్కెట్లో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ.12,400 కోట్ల వద్ద రెండేళ్ల గరిష్ఠానికి చేరాయి. 2024 చమురు ఉత్పత్తి లక్ష్యాలపై చర్చించేందుకు ఒపెక్+ గురువారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. ముడి చమురు ధరలు మంగళవారం రెండు శాతానికి పైగా పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 82.05 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) మంగళవారం రూ.783 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) సైతం రూ.1,324 కోట్లు విలువ చేసే స్టాక్స్ను కొన్నారు.
గమనించాల్సిన స్టాక్స్..
- ఐఆర్ఈడీఏ: ఇటీవలే ఐపీఓకి వచ్చిన ఈ ప్రభుత్వం రంగ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ కానున్నాయి. రూ.32 ఇష్యూ ధర వద్ద ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే.
- పీసీబీఎల్: రూ.3,800 కోట్లతో ఆక్వాఫామ్ కెమికల్స్ కొనుగోలుకు పీసీబీఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.
- కెనరా బ్యాంక్: అనుబంధ సంస్థ కెన్బ్యాంక్ ఫ్యాక్టర్స్లో 70 శాతం వాటాలను ఉపసంహరించుకునేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, కెన్బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్లో వాటాలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది.
- హావెల్స్ ఇండియా: పశ్చిమాసియా మార్కెట్లో తమ కన్జ్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్ ‘Lloyd’ను హావెల్స్ ఇండియా ప్రవేశపెట్టింది.
- వరుణ్ బెవరేజెస్: బెవరేజీల పంపిణీ కోసం వరుణ్ బెవరేజెస్ మొజాంబిక్లో ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది.
- TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ (బైబ్యాక్)ను డిసెంబరు 1 నుంచి 7 వరకు నిర్వహించనుంది. ఈ బైబ్యాక్లో మదుపర్ల దగ్గర నుంచి 4.09 కోట్ల షేర్లను (సంస్థలో 1.12 శాతం వాటా) ఒక్కోటి రూ.4,150 చొప్పున కొనుగోలు చేయనుంది. మంగళవారం టీసీఎస్ షేరు ముగింపు ధర రూ.3,470.45తో పోలిస్తే, ఈ ధర 20 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?