Stock Market: ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ @ 75,424

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది.

Published : 24 May 2024 09:29 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో పుంజుకొని కాసేపటికే ఫ్లాట్‌గా మారాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 75,424 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 22,962 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.18 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎం అండ్‌ ఎం, మారుతీ, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.4,671 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.147 కోట్ల వాటాలను కొన్నారు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని