Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,993
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 72,432 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు కుంగి 21,993 దగ్గర కొనసాగుతోంది.
Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 72,432 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు కుంగి 21,993 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.95 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్ అండ్ టీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం మిశ్రమంగా ముగిశాయి. నిన్న వెలువడిన ఎఫ్ఓఎంసీ సమావేశ మినిట్స్లో రేట్ల తగ్గింపుపై ఫెడరల్ రిజర్వ్ స్పష్టతనివ్వలేదు. ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యిత పరిధిలోకి రాని నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తామని తెలిపింది. నేడు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 83.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.284.66 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.411.57 కోట్ల వాటాలను విక్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!