Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,355

Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 154 పాయింట్ల నష్టంతో 73,717 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 22,355 దగ్గర కొనసాగుతోంది.

Published : 05 Mar 2024 09:31 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 154 పాయింట్ల నష్టంతో 73,717 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు కుంగి 22,355 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.564.06  కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,542.87 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని