Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 22,000 దిగువకు నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 256 పాయింట్ల నష్టంతో 72,505 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 21,957 దగ్గర కొనసాగుతోంది.

Updated : 14 Mar 2024 09:58 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 256 పాయింట్ల నష్టంతో 72,505 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 21,957 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.85 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, మారుతీ, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, టైటన్‌, ఇండస్ఇండ్ బ్యాంక్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, విప్రో, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 84.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.4,595.06 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.9,093.72 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని