Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,100

Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 131 పాయింట్ల నష్టంతో 72,966 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు కుంగి 22,106 దగ్గర కొనసాగుతోంది.

Published : 15 Mar 2024 09:33 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 131 పాయింట్ల నష్టంతో 72,966 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు కుంగి 22,106 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో పవర్ గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.1,356.29 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.139.47 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని