Stock Market: ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,495

Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ 19 పాయింట్ల నష్టంతో 74,099 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,495 దగ్గర కొనసాగుతోంది.

Published : 11 Mar 2024 09:30 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు (Stock Market) సోమవారం ఆరంభంలో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ 19 పాయింట్ల నష్టంతో 74,099 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 22,495 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.70 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలూ ప్రతికూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 81.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.7,304.11 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,601.81 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు