Stock Market: ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,000

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతోంది.

Updated : 18 Mar 2024 09:38 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే పుంజుకొని ఫ్లాట్‌గా మారాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.84 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, టైటన్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) శుక్రవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఈనెల 19-20 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశాలు ఈవారం మన మార్కెట్లకు కీలకం కానున్నాయి. వడ్డీ రేట్ల కోతలకు సంబంధించి చేసే వ్యాఖ్యలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా ఈవారంలోనే వడ్డీ రేట్లు నిర్ణయించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శుక్రవారం నికరంగా రూ.848.56 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.682.26 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని