Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ @ 74,143

Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 57 పాయింట్ల లాభంతో 74,143 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 22,489 దగ్గర కొనసాగుతోంది.

Published : 07 Mar 2024 09:37 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 57 పాయింట్ల లాభంతో 74,143 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 22,489 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.83 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎం అండ్‌ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలూ సానుకూలంగానే ఉన్నాయి. జపాన్‌ నిక్కీ సూచీ ఆరంభంలో రికార్డు గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 82.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.2,767 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.2,150 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని