Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 21,880

Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 168 పాయింట్ల పుంజుకొని 72,180 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 21,887 దగ్గర కొనసాగుతోంది.

Published : 20 Mar 2024 09:29 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 168 పాయింట్ల పుంజుకొని 72,180 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 21,887 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.02 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, పవర్‌ గ్రిడ్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, టైటన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 87.24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.1,421.48 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.7,449.48 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని