Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,000

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 532 పాయింట్ల పుంజుకొని 72,633 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,999 దగ్గర కొనసాగుతోంది.

Published : 21 Mar 2024 09:33 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 532 పాయింట్ల పుంజుకొని 72,633 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,999 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.06 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో నెస్లే ఇండియా, మారుతీ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు తన ప్రామాణిక వడ్డీ రేట్లను మార్చలేదు. 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25-5.50 శాతంగానే కొనసాగించింది. వరుసగా అయిదో సమావేశంలోనూ వడ్డీరేట్లలో మార్పు చేయనట్లయ్యింది. ద్రవ్యోల్బణం ఫెడ్‌ లక్ష్యమైన 2 శాతానికి ఎగువనే నమోదవుతూ వస్తుండడం ఇందుకు నేపథ్యం. ఫిబ్రవరి ద్రవ్యోల్బణం అంచనాల కంటే అధికంగా 3.2 శాతంగా నమోదైంది.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ సూచీ ఆరంభంలో ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.2,599.19 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,667.52 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని