Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,066

Stock Market Opening bell: ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది.

Published : 27 Mar 2024 09:33 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.31 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ ప్రధాన సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.10.13 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.5,024.36 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని