Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరానికి భారీ లాభాలతో స్వాగతం!

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతోంది.

Updated : 01 Apr 2024 10:20 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సోమవారం లాభాలతో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతోంది.

సెన్సెక్స్‌-30 సూచీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 87.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.188.31 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,691.52  కోట్ల స్టాక్స్‌ను కొన్నారు. మార్చి వాహన విక్రయాలు, జీఎస్‌టీ వసూళ్లు, పీఎంఐ గణాంకాలపై ఈవారం మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఏప్రిల్‌ 3-5 తేదీల్లో జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశం కీలకం కానుంది. ఈసారి కూడా కీలక రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని