Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,550 ఎగువకు నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 484 పాయింట్లు లాభపడి 74,361 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 22,579 దగ్గర కొనసాగుతోంది.

Published : 04 Apr 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 484 పాయింట్లు లాభపడి 74,361 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 144 పాయింట్లు పెరిగి 22,579 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 89.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.2,213.56 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,102.41 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని