Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,574

Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 203 పాయింట్లు లాభపడి 74,451 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,574 దగ్గర కొనసాగుతోంది.

Updated : 08 Apr 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు ట్రేడింగ్‌ను సానుకూలంగా మొదలుపెట్టాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 203 పాయింట్లు లాభపడి 74,451 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,574 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.27 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) శుక్రవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 89.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శుక్రవారం నికరంగా రూ.1,659.27 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,370.42 కోట్ల స్టాక్స్‌ను అమ్మారు.

రంజాన్‌ సందర్భంగా గురువారం సెలవు కావడంతో, ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు కీలకం కానున్నాయి. ఈనెల 12న టీసీఎస్‌తో మార్చి త్రైమాసిక కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ ప్రారంభం కానుంది. దేశీయంగా.. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, మార్చి రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈవారమే విడుదల కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని