Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,700

Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 174 పాయింట్లు లాభపడి 74,858 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,704 దగ్గర కొనసాగుతోంది.

Published : 10 Apr 2024 09:30 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు ఆరంభంలో సానుకూలంగా ఉన్నాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 174 పాయింట్లు లాభపడి 74,858 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,704 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.21 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం అప్రమత్తంగా కదలాడాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్‌లో మార్చి నెల ద్రవ్యోల్బణం ఎగబాకింది. న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్‌ కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లపై నిర్ణయాలు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 89.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.593.20 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,257.18 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని