Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,362

Stock Market Opening bell: ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 299 పాయింట్లు నష్టపోయి 73,604 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు కుంగి 22,362 దగ్గర కొనసాగుతోంది.

Published : 03 Apr 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 299 పాయింట్లు నష్టపోయి 73,604 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు కుంగి 22,362 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 89.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ మంగళవారం నికరంగా రూ.1,622.69 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,952.72 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని