Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,458

Stock Market Opening bell: ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలు మరికాసేపట్లో వెలువడనున్న తరుణంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Published : 05 Apr 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 218 పాయింట్లు నష్టపోయి 74,009 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు కుంగి 22,458 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.43 వద్ద ప్రారంభమైంది. మరికాసేపట్లో ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలు వెలువడనున్నాయి.

సెన్సెక్స్‌-30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, పవర్ గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 90.95 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.1,136.47 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.893.11 కోట్ల స్టాక్స్‌ను విక్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు