Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ @ 74,908

Stock Market Opening bell: ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,718 దగ్గర కొనసాగుతోంది.

Updated : 12 Apr 2024 09:53 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,718 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.35 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో మార్చి ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎగువన నమోదైంది. ద్రవ్యోల్బణం లక్ష్యానికి దిగి వచ్చాకే, కీలక రేట్ల కోతపై ఆలోచన చేస్తామని ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టం చేసింది. ఐరోపా కేంద్రబ్యాంక్‌ అందుకు భిన్నంగా ఉంది. కీలక ప్రామాణిక రేట్లను రికార్డు గరిష్ఠ స్థాయి అయిన 4% వద్దే ఇప్పటికీ కొనసాగిస్తున్నా, వీటిని తగ్గించే అంశం పరిశీలనలో ఉందని బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టీన్‌ లగార్డే పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 90.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.2,778.17 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.163.36 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని