Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,322

Stock Market Opening bell: ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 568 పాయింట్లు నష్టపోయి 73,676 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు కుంగి 22,322 దగ్గర కొనసాగుతోంది.

Published : 15 Apr 2024 09:33 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 568 పాయింట్లు నష్టపోయి 73,676 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు కుంగి 22,322 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.44 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్‌-30 సూచీలో నెస్లే ఇండియా, టీసీఎస్‌ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. 

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారాన్ని నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 90.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శుక్రవారం నికరంగా రూ.8,027 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.6,341.53 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని