Stock Market: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది.

Published : 19 Apr 2024 09:39 IST

Stock Market Opening bell | ముంబయి: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠమైన రూ.83.55 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, విప్రో, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. 

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు దిగిందన్న వార్తలు ప్రపంచ మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.4,260.33 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.2,285.52 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని