Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది.

Published : 25 Apr 2024 09:41 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల కదలికలు దేశీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ స్టాక్స్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం ఇంట్రాడేలో ఒడుదొడుకుల్లో చలించినప్పటికీ చివరకు లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 88.07 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.2,511.74  కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.3,809.90 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని