Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ @ 21,960

Stock Market Opening bell: ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 72,394 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 21,960 దగ్గర కొనసాగుతోంది.

Published : 29 Feb 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ (Stock Market) సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల అండతో కాసేపటికే పుంజుకొని స్వల్ప లాభాల్లోకి ఎగబాకాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 89 పాయింట్ల లాభంతో 72,394 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 21,960 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.88 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో రిలయన్స్, ఎం అండ్‌ ఎం, టైటన్‌, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌ గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ బుధవారం నికరంగా రూ.1,879.23 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.1,827.45 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని