Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,068

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 159 పాయింట్లు నష్టపోయి 72,548 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు కుంగి 22,068 దగ్గర కొనసాగుతోంది.

Published : 20 Feb 2024 09:32 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 159 పాయింట్లు నష్టపోయి 72,548 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 53 పాయింట్లు కుంగి 22,068 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.00 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం పనిచేయలేదు. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ సోమవారం నికరంగా రూ.754.59 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.452.70 కోట్ల విలువ చేసే వాటాలను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని