Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 500 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్‌

Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 529 పాయింట్ల లాభంతో 72,609 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకొని 22,037 దగ్గర కొనసాగుతోంది.

Updated : 05 Jun 2024 09:52 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం నాటి రికార్డు నష్టాల నేపథ్యంలో ఆరంభంలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మధ్యలో కాసేపు నస్టాల్లోకి జారుకున్నప్పటికీ తిరిగి కోలుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 529 పాయింట్ల లాభంతో 72,609 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకొని 22,037 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.46 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్‌ ఎం, ఐటీసీ, మారుతీ, ఇన్ఫోసిస్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 77.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.12,436 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.3,318 కోట్ల వాటాలను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని