Stock Market: మూడోరోజూ నష్టాలే.. 18,150 దిగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 128.90 పాయింట్ల నష్టంతో 61,431.74 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 51.80 పాయింట్లు నష్టపోయి 18,129.95 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లకు గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది. స్థిరాస్తి, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ఈరోజు వెలువడ్డ పలు కంపెనీల మార్చి త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. సూచీల్లో ప్రాధాన్య వెయిటేజీ ఉన్న ఎస్బీఐ, ఐటీసీ ఫలితాలు వెలువడ్డ తర్వాత మార్కెట్లు మరింత కిందుకు వెళ్లాయి.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 61,937.86 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,349.34 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 128.90 పాయింట్ల నష్టంతో 61,431.74 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,287.50 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,104.85 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 51.80 పాయింట్లు నష్టపోయి 18,129.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 82.59 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, విప్రో షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, ఐటీసీ, టైటన్, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, హెచ్యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, టాటా స్టీల్, సన్ఫార్మా షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్లోని ఇతర విషయాలు..
☛ మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో స్టాక్ విలువ ఈరోజు 2.05 శాతం నష్టపోయి రూ.418.85 దగ్గర స్థిరపడింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 7 శాతం పుంజుకొని రూ.19,058 కోట్లకు చేరింది. నికర లాభం 23 శాతం పెరిగి రూ.5,175 కోట్లకు ఎగబాకింది.
☛ ఎస్బీఐ షేరు ఈరోజు 1.70 శాతం నష్టపోయి రూ.576.35 వద్ద ముగిసింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బ్యాంకు ఈరోజు ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 83 శాతం పెరిగి రూ.16,694.51కు చేరింది.
☛ నిన్న వెలువడ్డ జుబిలంట్ ఫుడ్వర్క్స్ త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.27 శాతం నష్టపోయి రూ.475 దగ్గర స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!